సీతానగరం పుష్కర ఘాట్లకు విచ్చేసే భక్తుల సమాచారం కోసం తాడేపల్లి మునిసిపల్ అధికారులు సోమవారం వివిధ ప్రాంతాల్లో మార్గ సూచికలను ఏర్పాటు చేశారు.
మార్గసూచికలు ఏర్పాటు
Aug 8 2016 9:59 PM | Updated on Sep 4 2017 8:25 AM
తాడేపల్లి రూరల్ : సీతానగరం పుష్కర ఘాట్లకు విచ్చేసే భక్తుల సమాచారం కోసం తాడేపల్లి మునిసిపల్ అధికారులు సోమవారం వివిధ ప్రాంతాల్లో మార్గ సూచికలను ఏర్పాటు చేశారు. పుష్కర నగర్ల నుంచి సీతానగరం ఘాట్లకు వచ్చే మార్గాలను సూచిస్తూ వంద బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే పుష్కర ఘాట్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సూచిక బోర్డులను కూడా రహదార్ల వెంట, ప్రతి 500 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
Advertisement


