సిమెంట్‌ ఇటుకల మాటున ‘ఎర్ర’దుంగల స్మగ్లింగ్‌ | Sakshi
Sakshi News home page

సిమెంట్‌ ఇటుకల మాటున ‘ఎర్ర’దుంగల స్మగ్లింగ్‌

Published Sun, Feb 26 2017 10:08 AM

redsandlewood smugglers cought in nellore

నెల్లూరు:
సిమెంట్‌ ఇటుకల మాటున ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ శాఖ అధికారులు 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఆసిలివలస ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుందనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఓ ట్రాక్టర్‌లో సిమెంట్‌ బ్రిక్స్‌ మధ్యలో ఉంచి తీసుకెళ్తున్న రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement