టీఆర్‌ఎస్‌ నేతలు చిత్తశుద్ధిని చాటుకోవాలి | prove the trs leaders strategy | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నేతలు చిత్తశుద్ధిని చాటుకోవాలి

Sep 15 2016 12:31 AM | Updated on Sep 4 2017 1:29 PM

గద్వాలను జిల్లా చేయాలని ఏర్పడిన జేఏసీతో సహకరించి నడిగడ్డ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని అలంపూర్‌ ఎమ్మెల్యే ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ అన్నారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వనపర్తి జిల్లాలో కలపాలని ఆలంపూర్, గద్వాలకు చెందిన 18మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమ్మతి పత్రాలను ఇచ్చారని ప్రచారం జరుగుతోందని, దీనిని ఖండించాల్సిన అవసరం ప్రజాప్రతినిధులందరిపై ఉందన్నారు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : గద్వాలను జిల్లా చేయాలని ఏర్పడిన జేఏసీతో సహకరించి నడిగడ్డ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని అలంపూర్‌ ఎమ్మెల్యే ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ అన్నారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వనపర్తి జిల్లాలో కలపాలని ఆలంపూర్, గద్వాలకు చెందిన 18మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమ్మతి పత్రాలను ఇచ్చారని ప్రచారం జరుగుతోందని, దీనిని ఖండించాల్సిన అవసరం ప్రజాప్రతినిధులందరిపై ఉందన్నారు. 
 
జిల్లాల పునర్విభజనలో సీఎం కేసీఆర్‌ నిబంధనలకు పాతవేశారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఈనెల 16న ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశమై తీర్మానాలు చేస్తారన్నారు. 17న జరిగే జిల్లా పరిషత్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌లో తనతోపాటు ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు గద్వాల జిల్లా అంశాన్ని లేవనెత్తుతామన్నారు. అలాగే ఈనెల 23న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. సమావేశంలో ఆలంపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు రామకృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, జగన్‌గౌడ్, జగదీష్, ముత్యాలగౌడ్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement