చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం 220లీటర్ల నీలి కిరోసిన్ను పట్టుకున్నట్టు తహసీల్దార్ షేక్అహ్మద్ తెలిపారు.
220 లీటర్ల నీలికిరోసిన్ పట్టివేత
Jul 19 2016 11:45 PM | Updated on Apr 3 2019 4:43 PM
చౌటుప్పల్
మండలంలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం 220లీటర్ల నీలి కిరోసిన్ను పట్టుకున్నట్టు తహసీల్దార్ షేక్అహ్మద్ తెలిపారు. అరిగె భిక్షపతి కిరాణం దుకాణంలో 170లీటర్లు, సూరంశెట్టి రంగయ్య కిరాణం దుకాణంలో 50లీటర్ల నీలి కిరోసిన్ నిల్వ ఉంచగా, గ్రామ పోలీసు అధికారి రమేష్ పట్టుకుని, అప్పగించినట్టు తెలిపారు. ప్రజాపంపిణీ కిరోసిన్ను అక్రమంగా నిల్వ ఉంచినందుకు 6ఏ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కిరోసిన్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement