
భూగర్భంలో పూజలందుకుంటున్న శివలింగం
కాకతీయుల కాలంలో విరాజిల్లి పూజలందుకున్న పవిత్ర లింగం..900 ఏళ్లు శిథిలాల్లో కలిసి బయల్పడిన మహిమాన్విత లింగం..మరెక్కడా లేనివిధంగా భూగర్భంలో పూజలందుకుంటున్న నీలకంఠేశ్వర లింగం..మణుగూరులో దర్శనమిస్తోంది. ఇక్కడికొస్తే భక్తిభావమే కాదు..చారిత్రక ఆనవాళ్లను మననం చేసుకోవచ్చు.
- కాకతీయ చరిత్రకు నిదర్శనం – ఢిల్లీ సుల్తానుల దాడిని ఎదుర్కొన్న దేవాలయ ప్రాంతం
- రెండు శివలింగాలుండడం ఇక్కడి ప్రత్యేకం
- మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి వారి చరిత అనేకం
కాకతీయుల కాలంలో విరాజిల్లి పూజలందుకున్న పవిత్ర లింగం..900 ఏళ్లు శిథిలాల్లో కలిసి బయల్పడిన మహిమాన్విత లింగం..మరెక్కడా లేనివిధంగా భూగర్భంలో పూజలందుకుంటున్న నీలకంఠేశ్వర లింగం..మణుగూరులో దర్శనమిస్తోంది. ఇక్కడికొస్తే భక్తిభావమే కాదు..చారిత్రక ఆనవాళ్లను మననం చేసుకోవచ్చు. గరళకంఠుడైన మహాశివుడు..ఇక్కడి ఆలయంలో పానవట్టం కింద ఉన్న శివలింగంతో పాటు, కచ్చితంగా అదే స్థానంలో ఆలయం కిందిభాగంలో పూజలందుకోవడం..అరుదైన, అద్వితీయ అనుభూతిని అందిస్తోంది. భక్తి, ఆరాధనతో కొలిస్తే..పునీతం చేస్తోంది.
– మణుగూరు
శతాబ్దాల చరితం..దర్శిస్తే పునీతం
మణుగూరులోని కాకతీయుల కాలంనాటి శ్రీ నీలకంఠేశ్వరాలయం కాకతీయుల చరిత్రకు మచ్చుతునకగా నిలుస్తోంది. చరిత్రను పరిశీలిస్తే ఈ ఆలయాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు 1161లో నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కోటకట్ట అనేవారు. ఈ ఊరిని మణిపురంగా పిలిచేవారు. కాకతీయుల కాలంలో విరాజిల్లిన నీలకంఠేశ్వరాలయాన్ని అనంతర కాలంలో మహ్మదీయ రాజులైన ఢిల్లీ సుల్తానులు 1162లో ధ్వంసం చేశారు. ఇక్కడ శిథిలాలు, మట్టిదిబ్బలో శివలింగం ఉండింది. ఇక్కడికి సమీపంలోని ప్రాచీన వేణుగోపాలస్వామి ఆలయంలో కన్నె వీరభద్రయ్య అనే ఓ సన్యాసి ఉండగా..ఆయనకు కలలో శివలింగం ఉన్నట్లు కనిపించడంతో మట్టిదిబ్బను తన శిశ్యులు మల్లిడి లాలయ్య, పూజారి తాతయ్య, పాల్వాయి రామచంద్రయ్య, కందుకూరి అనంతరామయ్యలతో 1958లో తవ్వించారు. దాదాపు 900 ఏళ్లతర్వాత ఇక్కడ భూగర్భంలో శివలింగం బయల్పడింది. ఇనేళ్ల చరిత కలిగిన స్వామివారిని పూజిస్తే జీవితం పునీతం అవుతుందని భక్తుల విశ్వాçÜం.
=======================
భూగర్భ దర్శనం..స్వామివారి ప్రత్యేకం
శివలింగంతో పాటు బయల్పడిన నంది, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిషి్ఠంచారు. శివలింగాన్ని భూగర్భం నుంచి పైకి తెచ్చి ఆలయం నిర్మించాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో..అప్పటి నుంచి ఇలా భూగర్భంలోనే ఉంచుతున్నారని స్థానికులు మల్లిడి లాలయ్య తెలిపారు. 1995 తర్వాత పలువురు దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. భూగర్భంలో ఉన్న శివలింగాన్ని యథావిథిగా ఉంచేసి..పైభాగంలో మరోటి ప్రతిషి్ఠంచారు. భూగర్భంలో ఉన్న లింగానికి సీలింగ్ పైభాగంలో జాలీ ఏర్పాటు చేసి..రెండు లింగాలకు పానవట్టాలు ఉంచారు. ఇక్కడ ఒకేసారి భూగర్భంలో, పైభాగంలో స్వామివార్లను దర్శించుకోవడాన్ని భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించి పులకిస్తుంటారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయంలో శివరాత్రి, కార్తీక మాస పూజలను ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయ పూజారిగా రామచంద్రమూర్తి వ్యవహరిస్తున్నారు. శివలింగానికి గోదావరి జలాలతో సహస్ర ఘటాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించనున్నారు.