'గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయి' | Nathuram godse close to rss, says N Raghuveera reddy | Sakshi
Sakshi News home page

'గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయి'

Jan 30 2016 12:31 PM | Updated on Aug 29 2018 6:00 PM

'గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయి' - Sakshi

'గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయి'

జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు.

అనంతపురం : జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం అనంతపురంలో రఘువీరా మాట్లాడుతూ... హెచ్సీయూ విద్యార్థి రోహిత్ మరణానికి కారకులైన కేంద్రమంత్రులను తొలగించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీలకు వ్యతిరేకమని... అందుకే వారిపట్ల వివక్ష చూపుతుందని ఆయన విమర్శించారు.

 హెచ్సీయూ వీసీ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  గాడ్సే , గాంధీ వారసుల మధ్య సైద్ధాంతిక పోరు జరుగుతుందని రఘువీరా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement