నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కులుంబ కలహాల నేపథ్యంలో తల్లీ కూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని తాడ్వాయి మండలం కరాడ్పల్లిలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తల్లీ కూతుళ్లు బుధవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.