వివాహిత ఆత్మహత్య | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jun 9 2016 3:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

 కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న మహిళ బయటకు పరుగులు తీసి గడ్డివాము వద్దకు వెళ్లడంతో.. గడ్డివాముకు నిప్పంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం రానంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

 

గ్రామానికి చెందిన సావిత్రి(28) బుధవారం రాత్రి భర్తతో గొడవపడి ఈరోజు తెల్లవారుజామున వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఆ మంట తాళలేక గడ్డివాము వద్దకు పరుగులు తీయడంతో.. గడ్డివాముకు నిప్పంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పడానికి యత్నించే లోపే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement