ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం | maoists-kill-suspected-informer | Sakshi
Sakshi News home page

ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం

Jan 15 2016 10:09 AM | Updated on Mar 28 2019 5:07 PM

ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం - Sakshi

ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం

మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు.ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.

ఒడిశా: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని బొరిగి గ్రామంలో ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నారనే నెపంతో ఒకరిని హతమార్చారు. స్థానిక గ్రామానికి చెందిన నచ్ మూలి ఆదివాసి సంఘంనేత నాచక రోలిని శుక్రవారం మావోయిస్టులు కాల్చి చంపారు. మృత దేహం వద్ద శ్రీకాకుళం- కోరాపుట్ ఎవోబీ కార్యదర్శి దయ పేరుతో లేఖను వదిలి వెళ్లారు. మావోయిస్టు కార్యకలాపాలను పోలీసులకు చేరవేస్తున్నాడని హతమార్చినట్టు లేఖలో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement