మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన మానాపురం లక్ష్మి (30) పాముకాటుతో మరణించింది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాముకాటుతో మహిళ కన్నుమూత
Jul 25 2016 11:56 PM | Updated on Sep 4 2017 6:14 AM
సాలూరు రూరల్ : మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన మానాపురం లక్ష్మి (30) పాముకాటుతో మరణించింది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మి సోమవారం ఉదయం పొలానికి వెళ్తుండగా పాము కాటుకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మతురాలికి భర్త వెంకటరావు, ఇద్దరు కుమారులున్నారు.
Advertisement


