ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సహస్రకు చోటు | India Book of Records as the place to sahasra | Sakshi
Sakshi News home page

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సహస్రకు చోటు

Nov 21 2015 2:12 AM | Updated on Sep 3 2017 12:46 PM

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సహస్రకు చోటు

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సహస్రకు చోటు

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన సాయిని సంతోష్-అనూష దంపతుల కుమార్తె సహస్ర

ఒక నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చదివిన ఆసిఫాబాద్ చిన్నారి
 
 ఆసిఫాబాద్ : ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన సాయిని సంతోష్-అనూష దంపతుల కుమార్తె సహస్ర చోటు దక్కిందించుకుంది. తండ్రి సంతోష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సహస్ర కూడా అక్కడే చందానగర్ క్యూట్ ఎలాండ్ స్కూల్‌లో నర్సరీ చదువుతోంది. గత నెల 14న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఏర్పాటు చేసిన పోటీల్లో ఒక నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చదివి అబ్బురపరిచింది. గతంలో ఒక నిమిషంలో ఎనిమిది శ్లోకాలు చదివిన రికార్డులను అధిగమించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement