
మార్కెట్లోకి ‘హోండా నవి’
అనంతపురంలోని రాంనగర్లో ఉన్న ధన్వి హోండా షోరూంలో ‘హోండా నవి’ ద్విచక్ర వాహనాన్ని బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు.
అనంతపురం టౌన్ : అనంతపురంలోని రాంనగర్లో ఉన్న ధన్వి హోండా షోరూంలో ‘హోండా నవి’ ద్విచక్ర వాహనాన్ని బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ధన్వి హోండా అధినేత కవినాథ్రెడ్డి, ఆయన సతీమణి శ్వేత వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువతను దృష్టిలో ఉంచుకుని సై్టలిష్ లుక్లో హోండా నవిని రూపొందించారన్నారు.
110 సీసీ, వితౌట్ గేర్ ఈ వాహనం ప్రత్యేకత అన్నారు. ఎక్స్ షోరూం ధర రూ.42,043 ఉంటుందన్నారు. తెలుపు, నలుపు, ఆరెంజ్, ఎరుపు, గ్రీన్ రంగుల్లో లభిస్తుందన్నారు. కార్యక్రమంలో హోండా ప్రతినిధి నాగార్జున, మేనేజర్లు కృష్ణ, రాజేంద్ర పాల్గొన్నారు.