in market
-
మార్కెట్లోకి ‘టాటా జెనాన్ యోధా’
అనంతపురం సెంట్రల్ : టాటా కంపెనీ ‘జెనాన్ యోధా’ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. గురువారం నగరంలోని మాసినేని గ్రాండ్ హోటల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనానికి ఉన్న సరికొత్త ఫీచర్స్ను కంపెనీ ప్రతినిధులు కస్టమర్స్కు వివరించారు. కార్యక్రమంలో కంపెనీ ఆర్ఎస్ఎం రాజశేఖర్, ఏరియా మేనేజర్ దావూద్, టీఎస్ఎం అశోక్కుమార్, మేరూ ఆటో మొబైల్స్ సేల్స్ రెప్రజెంటేటివ్స్, కస్టమర్లు పాల్గొన్నారు. -
ఉల్లి ధర మరింత పతనం
తాడేపల్లిగూడెం : కిలో ఉల్లి మార్కెట్లో ఎనిమిది రూపాయలకే లభ్యమవుతుతోంది. కర్నూలు నుంచి ఇక్కడి మార్కెట్కు వచ్చే ఉల్లిపాయల ధరలు ఆదివారం తగ్గుముఖం పట్టాయి. గుత్త మార్కెట్లో క్వింటాలు రూ.500 నుంచి రూ.600 వరకు ధర పలికాయి. రిటైల్ మార్కెట్లో కిలో ఎనిమిది రూపాయలకే ఉల్లిపాయలు లభ్యమయ్యాయి. పాత ఉల్లిపాయలు మహారాష్ట్ర నుంచి మార్కెట్కు వచ్చాయి. కిలో రూ.12 చేసి గుత్త మార్కెట్లో అమ్మగా, విడిగా కిలో రూ.16 చేసి విక్రయించారు. 60 లారీల వరకు మార్కెట్కు సరుకు వచ్చినా, కొనేవారు లేక మార్కెట్ మందకొడిగా సాగింది. కూరగాయల ధరలు కూడా నెమ్మదించాయి. మార్కెట్కు కొత్తగా వచ్చిన పొట్టి చిక్కుడు ధర ఎక్కువుగా పలికింది. తెల్లవంకాయలు కిలో రూ.40 వరకు అమ్మారు. నల్ల వంకాయలు కిలో రూ.20గా ఉన్నాయి. బీర కాయలు కిలో రూ.30 ధర పలికాయి. బెండకాయల ధర మళ్లీ దిగజారింది. గుత్తగా పది కిలోలు రూ.70 పలికాయి. విడిగా కిలో 12 రూపాయలకు అమ్మారు. దొండ కాయలు కిలో రూ.16, దోసకాయలు కిలో రూ.10, చిక్కుడు కాయలు కిలో రూ.24 ధరకు విక్రయించారు. పొట్టి చిక్కుడు కాయలు కిలో 80 రూపాయలకు లభించాయి. క్యాబేజీ కిలో 10 రూపాయలకు పతనమైంది. క్యారట్ కిలో రూ.30, బీట్రూట్ కిలో రూ.30, కీరా కిలో రూ.30 లకు అమ్మారు. -
మార్కెట్లోకి ‘హోండా నవి’
అనంతపురం టౌన్ : అనంతపురంలోని రాంనగర్లో ఉన్న ధన్వి హోండా షోరూంలో ‘హోండా నవి’ ద్విచక్ర వాహనాన్ని బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ధన్వి హోండా అధినేత కవినాథ్రెడ్డి, ఆయన సతీమణి శ్వేత వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువతను దృష్టిలో ఉంచుకుని సై్టలిష్ లుక్లో హోండా నవిని రూపొందించారన్నారు. 110 సీసీ, వితౌట్ గేర్ ఈ వాహనం ప్రత్యేకత అన్నారు. ఎక్స్ షోరూం ధర రూ.42,043 ఉంటుందన్నారు. తెలుపు, నలుపు, ఆరెంజ్, ఎరుపు, గ్రీన్ రంగుల్లో లభిస్తుందన్నారు. కార్యక్రమంలో హోండా ప్రతినిధి నాగార్జున, మేనేజర్లు కృష్ణ, రాజేంద్ర పాల్గొన్నారు.