ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండేళ్ల చంద్రబాబు పాలనపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనపై కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా మార్కాపురం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.
ఆ విషయం తెలిసి అప్పటికే టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని... టీడీపీ వారిని అక్కడ నుంచి పంపివేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నాయకులు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు.