శ్మశానవాటికలో మెుక్కలు నాటిన ఎస్పీ | haithaharam in smashanavatika | Sakshi
Sakshi News home page

శ్మశానవాటికలో మెుక్కలు నాటిన ఎస్పీ

Jul 20 2016 9:09 PM | Updated on Sep 18 2018 6:30 PM

ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ అన్నారు.

ఆదిలాబాద్‌ కల్చరల్‌:  ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంకోలిరోడ్‌లో గల క్రిస్టియ్‌ శ్మశాన వాటికలో హరితహరం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్‌ ముఖ్యఅతిథిగా హజరై శ్మశాన వాటిలో మొక్కలు నాటారు. ఇందులో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి, జోగుపౌండేషన్‌ చైర్మెన్‌ ప్రేమెందర్, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ సాజిదోద్దిన్, మావల సర్పంచ్‌ ఉష్కం రఘుపతి, తెలంగాణ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు బట్‌రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలం దివాకర్,బాస్కర్, పిల్లా ప్రవీన్, ఆలం రూప, డెవిడ్, సతీష్‌  తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement