సాయుధ పోరాట యోధుడికి సన్మానం | Sakshi
Sakshi News home page

సాయుధ పోరాట యోధుడికి సన్మానం

Published Sun, Sep 18 2016 10:41 PM

సాయుధ పోరాట యోధుడికి సన్మానం

కోదాడ: తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు, నడిగూడెం దొరకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన నడిగూడెం మండలం వాయిల సింగారానికి చెందిన చండూరు రామారావును ఆదివారం సీపీఎం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా  స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కుక్కడపు ప్రసాద్‌ మాట్లాడుతూ మునగాల పరగణాకు చెందిన నడిగూడెం జమిందార్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. సర్పంచ్‌గా పనిచేసిన 15 సంవత్సరాల కాలంలో 100 ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత రామారావుదన్నారు. పేదల కోసం నిరంతర ఉద్యమాలు నిర్వహించిన రామారావును స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమపంగు రాధాకృష్ణ, సూర్యనారాయణ, స్వరాజ్యం, కృష్ణ, లక్ష్మయ్య, శ్రీనివాస్, సతీశ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement