ఇన్నోవా బోల్తా, నలుగురు దుర్మరణం | four killed in visakha road accident | Sakshi
Sakshi News home page

ఇన్నోవా బోల్తా, నలుగురు దుర్మరణం

Nov 5 2016 5:12 PM | Updated on Sep 4 2017 7:17 PM

విశాఖ జిల్లా రాయవరం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

విశాఖపట్టణం : విశాఖ జిల్లా రాయవరం సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం ముందుగా డివైడర్ను ఢీకొని అనంతరం పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

వీరంతా గాజువాక నుంచి పాయకరావుపేట వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గాజువాకకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement