కరెంట్ షాక్ తగిలి రైతు మృతి | farmer death due to current shock | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్ తగిలి రైతు మృతి

Jul 27 2016 8:47 AM | Updated on Oct 1 2018 4:01 PM

నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమా రమేశ్ (35) అనే రైతు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజు అమరుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

గ్రామస్తుల సహాయంతో అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు.  భూమా రమేశ్ మరణ వార్త తెలియగానే అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement