
కుటుంబ వివాదంతో గోదారిలో దూకిన వివాహిత
భార్య, భర్తల మధ్య వివాదం తలెత్తడంతో రాజోలు మండలం ములికిపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల వివాహిత వాసంశెట్టి ప్రియాంక శుక్రవారం చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకేసింది.
- నదిలో గల్లంతు
- గాలింపు చర్యలు
ఆ క్రమంలో మణికంఠకుమార్ కుటుంబ సభ్యులు వీరిని వరలక్ష్మీ పూజ చేసుకునేందుకు ములికిపల్లి రావాలని ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం గ్రామం వచ్చిన ప్రియాంక, మణికంఠకుమార్ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి. వరలక్ష్మీ వ్రతం చేసుకున్న తర్వాత ప్రియాంక మోటార్ సైకిల్ వేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం వెతుకుతున్న సమయంలో చించినాడ వంతెనపై మోటార్ సైకిల్, ప్రియాంక చెప్పులను బంధువులు గుర్తించారు. ఆమె గోదావరిలో దూకేసిందనే అనుమానంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి పోలీసులు వివాహిత అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.