కాఫీ తోటలున్న గిరిజన రైతులకు జీసీసీ పంట రుణాలు అందజేస్తుందని ఆ సంస్థ డీఎం శర్మ చెప్పారు. శుక్రవారం జీకేవీధిలోని జీసీసీ బ్రాంచి కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.
గిరిజన రైతులకు జీసీసీ పంట రుణాలు
Jul 30 2016 12:08 AM | Updated on Oct 1 2018 2:11 PM
గూడెంకొత్తవీధి: కాఫీ తోటలున్న గిరిజన రైతులకు జీసీసీ పంట రుణాలు అందజేస్తుందని ఆ సంస్థ డీఎం శర్మ చెప్పారు. శుక్రవారం జీకేవీధిలోని జీసీసీ బ్రాంచి కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. జీసీసీని నమ్మి ఈ ఏడాది కాఫీ సాగు చేశాం.. పండిన కాఫీని అప్పగిస్తే సగం మాత్రమే చెల్లింపులు చేసిందని కొందరు గిరిజనులు డీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన Ô¶ ర్మ పాడేరు కాఫీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం కాఫీ తోటల విస్తీర్ణంతోపాటు దళారీల బారిన పడకుండా గిరిజన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే లక్ష్యంతో సర్కారు గురుతర బాధ్యతను అప్పగించింది.. కాఫీ సాగు రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడంతో పాటు రైతులకు అప్పగించిన కాఫీని అంతర్జాతీయ మార్కెట్లో వేలం వేసే ధరకు అంతా పక్కా ప్రణాళికతో డిజిటలీకరణ పద్ధతి అవలంబించాం అని శర్మ చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సగం ధరలను వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేశామని... రెండో విడత చెల్లింపునకు అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలు పతనం కావడంతో చెల్లింపులు ఆలస్యమైందని పేర్కొన్నారు. వేలంలో జాప్యం జరిగి రైతులకు రెండో విడత చెల్లింపులు ఆలస్యమైనట్లు తెలిపారు. మరో పది రోజుల వ్యవధిలో పూర్తి చెల్లింపులు చేస్తామని వెల్లడించారు. రైతులు ఆశించినంత రాకపోయినా ధరలు కంటే ఎక్కువ సొమ్ము చెల్లిస్తామన్నారు. గిరిజన రైతులను ఆదుకునే క్రమంలో కాఫీ పిక్కలు అమ్మిన వారందరికి ఎకరాకు రూ.10 వేలు చొప్పున వ్యవసాయ రుణం ఇచ్చే ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అంతకు ముందు మండలంలోని 36 డీఆర్ డిపోల సేల్స్మేన్లు, సిబ్బందితో ఆయన మట్లాడారు. కార్యక్రమంలో జీకేవీధి బ్రాంచి మేనేజర్ శ్రీనివాసరావు, గొడౌన్ సూపరింటెండెంట్ గంగరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement