బస్సులో ఉంచిన టికెట్ల బాక్సు, అందులో రూ.1000 నగదు దొంగలించారని మహిళా కండక్టర్ నాగూరమ్మ పట్టణ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది.
టికెట్ల బాక్సు చోరీపై ఫిర్యాదు
Oct 18 2016 1:36 AM | Updated on Sep 4 2017 5:30 PM
ధర్మవరం అర్బన్ : బస్సులో ఉంచిన టికెట్ల బాక్సు, అందులో రూ.1000 నగదు దొంగలించారని మహిళా కండక్టర్ నాగూరమ్మ పట్టణ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. తాడిపత్రి డిపో ఆర్టీసీ బస్సులో కండక్టర్ నాగూరమ్మ ధర్మవరం వచ్చింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సులోనే టికెట్ల బాక్సు, అందులో రూ.1000 నగదు ఉంచి, టిఫిన్ చేయడానికని బయటకు వెళ్లింది. ఆ సమయంలో బస్సు ఉంచిన టికెట్ల బాక్సు, నగదుతోపాటు ఎత్తుకెళ్లారు. టిఫిన్ చేసిన అనంతరం బస్సులో చూడగా టికెట్ల బాక్సు కనిపించలేదు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టికెట్ల విలువ రూ.18వేలు అని ఫిర్యాదులో పేర్కొంది. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement