మండలంలోని అంగలూరు గ్రామంలో పట్టపగలు చోరీ జరిగిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కట్టా వెంకట్రావు కుమార్తె అట్లూరి కుమారి మాచర్లలో నివాసం ఉంటోంది.
పట్టపగలు చోరీ
Sep 16 2016 10:24 PM | Updated on Sep 4 2017 1:45 PM
ఈపూరు: మండలంలోని అంగలూరు గ్రామంలో పట్టపగలు చోరీ జరిగిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కట్టా వెంకట్రావు కుమార్తె అట్లూరి కుమారి మాచర్లలో నివాసం ఉంటోంది. అయితే అంగలూరులో తన పెదనాన్న అంత్యక్రియల నిమిత్తం ఇక్కడకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను బ్యాగులో పెట్టి చెక్క బీరువాలో దాచింది. శుక్రవారం మధ్యాహ్నం స్నానం చేసి బంగారం కోసం బీరువాలో చూడగా బ్యాగు కనిపించలేదు. దీంతో ఈపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుమారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఉజ్వల్కుమార్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చోరీకి గురైన వాటిలో రెండు నానుతాడులు, నల్లపూసల గొలుసు, చెయిన్, చెవి దుద్దులు మొత్తం 12.5 సవర్ల బంగారం, రూ.7వేల నగదు ఉన్నట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement