క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై వర్క్‌షాపు ప్రారంభం | cloud computing workshop started | Sakshi
Sakshi News home page

క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై వర్క్‌షాపు ప్రారంభం

Aug 8 2016 11:44 PM | Updated on Sep 4 2017 8:25 AM

క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై వర్క్‌షాపు ప్రారంభం

క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై వర్క్‌షాపు ప్రారంభం

బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్‌టీయూకేలో సీఎస్‌ఈ విభాగం ఆధ్వర్వలో ఐదు రోజుల పాటు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అనే అంశంపై నిర్వహించే వర్క్‌షాపు సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాపులో మంజ్రా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆస్ట్రేలియా) సీఈఓ ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌ భూయ్యా మాట్లాడుతూ సాంకేతిక విప్లవ లాభాలు సామాన్య మానవుడి సమస్యలు తీర్చేలా ఉండాలన్నారు.70 శాతం ఐటీ వ్యాపార

బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్‌టీయూకేలో సీఎస్‌ఈ విభాగం ఆధ్వర్వలో ఐదు రోజుల పాటు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అనే అంశంపై నిర్వహించే వర్క్‌షాపు సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాపులో మంజ్రా సాఫ్ట్‌వేర్‌  ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆస్ట్రేలియా) సీఈఓ ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌ భూయ్యా మాట్లాడుతూ సాంకేతిక విప్లవ లాభాలు సామాన్య మానవుడి సమస్యలు తీర్చేలా ఉండాలన్నారు.70 శాతం ఐటీ వ్యాపార లావాదేవీలు అభివృద్ధి చెందిన దేశాల ద్వారా  జరుగుతున్నాయని, వాటిలో భారత దేశం 30 శాతంతో ముందుకు వెళ్తోందన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు సమీకృత విధానంతో మొబైల్‌ అప్లికేషన్లు, హెల్త్‌కేర్‌ అప్లికేషన్లు, రోబోటిక్‌ సర్వీస్‌లు వంటి వాటిలో వినూత్న ఆవిష్కరణలు జరిపి  సున్నిత సమస్యలకు సాంకేతికతను జోడించి పరిష్కరించాలన్నారు. అనంతరం రాజ్‌కుమార్‌ భయ్యాను వర్సిటీ అధ్యాపకులు సత్కరించారు. మొబైల్‌ అండ్‌ క్లౌడ్‌ ల్యాబ్‌ హెడ్‌ సతీ‹ష్‌నారాయణ్‌ శ్రీరామ్, సీఎస్‌ఈ విభాగాధిపతి డాక్టర్‌ కృష్ణమోహన్, కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎంహెచ్‌ కృష్ణప్రసాద్, కరుణ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement