చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదు: కేఈ | Chandrababu naidu has no clarity about nagireddy, says KE krishnamurthy | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదు: కేఈ

Feb 20 2016 6:19 PM | Updated on Sep 3 2017 6:03 PM

చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదు: కేఈ

చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదు: కేఈ

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి (నంద్యాల) కుటుంబం టీడీపీలో చేరికపై క్లారిటీ రాలేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు.

విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి (నంద్యాల) కుటుంబం టీడీపీలో చేరే అంశంపై అసలు ఇంతవరకు తమ పార్టీలో ఎవరికీ స్పష్టత లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ అంశంపై అసలు చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. భూమాను చేర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదని కేఈ అన్నారు.

శిల్పా మోహన్‌ రెడ్డి సోదరులు భూమా నాగిరెడ్డి రాకను సీఎం చంద్రబాబు నాయుడు వద్ద వ్యతిరేకించారని, అయితే చంద్రబాబు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement