55 వాహనాలపై కేసులు నమోదు | Sakshi
Sakshi News home page

55 వాహనాలపై కేసులు నమోదు

Published Thu, Sep 22 2016 1:48 AM

55 వాహనాలపై కేసులు నమోదు

 
  •  2.5 లక్షల జరిమానా
నెల్లూరు(టౌన్‌) : ఎలాంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న పలు వాహనాలపై బుధవారం రవాణా అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, గాంధీబొమ్మ సెంటర్, మినీ బైపాస్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్‌ కాని, లైసెన్స్‌ లేకుండా తిరుగుతున్న 55 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి వారికి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో మోటారు వాహనాల అధికారులు బాలమురళీకృష్ణ, మురళీమోహన్, రామకృష్ణారెడ్డి, ఏఎంవీఐలు ప్రభాకర్, భాస్కర్, సిబ్బంది మురళీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement