గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ చదివే తమ కుమారుడు ప్రశాంత్కుమార్రెడ్డి(18) అదృశ్యంపై పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఉమ, నాగార్జునరెడ్డి తెలిపారు.
గుత్తి (గుంతకల్లు) : గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ చదివే తమ కుమారుడు ప్రశాంత్కుమార్రెడ్డి(18) అదృశ్యంపై పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఉమ, నాగార్జునరెడ్డి తెలిపారు. గడచిన 30న సెమిస్టర్ పరీక్షలు రాయడానికి కళాశాలకు బయలుదేరిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదన్నారు. తెలిసిన చోటల్లా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు.