రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై దుర్మరణం


ఏలూరు : విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ఓ ఏఎస్సైని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఏఎస్సై అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో  చోటుచేసుకుంది. స్థానిక పోలీస్స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్న ధనరాజ్ (40) శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో  స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయ వద్ద రోడ్డు దాటుతుండగా.. బస్సు ఢీకొట్టింది. దీంతో ధనరాజ్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top