698 మంది మహిళా అభ్యర్థులు హాజరు | 698 women candidates attend | Sakshi
Sakshi News home page

698 మంది మహిళా అభ్యర్థులు హాజరు

Dec 8 2016 10:53 PM | Updated on Apr 4 2019 5:41 PM

698 మంది మహిళా అభ్యర్థులు హాజరు - Sakshi

698 మంది మహిళా అభ్యర్థులు హాజరు

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపిక ప్రక్రియ నాల్గోరోజూ కొనసాగింది. స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం మహిళా కానిస్టేబుల్‌ పోస్టుల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.

మచిలీపట్నం : పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపిక ప్రక్రియ నాల్గోరోజూ కొనసాగింది. స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం మహిళా కానిస్టేబుల్‌ పోస్టుల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. 1,200 మంది మహిళా అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 698 మంది హాజరయ్యారు. 100 మీటర్ల పరుగుపందెంకు 18 సెకన్లు, 1,600 మీటర్ల పరుగుపందెంకు 10.30 నిమిషాలు, లాంగ్‌జంప్‌ 2.75 మీటర్లుగా నిర్ణయించారు. గురువారం ఉదయానికే మహిళా అభ్యర్థులు బారులుతీరారు. సర్టిఫికెట్ల పరిశీలన, వేలిముద్రలు తీసుకున్న అనంతరం పోటీలకు పంపారు.  ప్రత్యేక వైద్యబృందాలను ఎస్పీ జి.విజయకుమార్‌ ఏర్పాటు చేయించారు. సొమ్మసిల్లి పడిపోయిన వారికి పోలీస్‌ విభాగానికి చెందిన వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement