కుప్పకూలిన ఫ్లైఓవర్.. ఘోర ప్రమాదం

Varanasi Flyover Collapsed kills Dozen in UP - Sakshi

వారణాసి: ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వారణాసిలోని కాంట్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరికొందరు కూలీలు శకలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, మంత్రి నీల్‌కాంత్‌ తివారీలను ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా సీఎం యోగి ఆదేశించారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top