సినిమా థియేటర్లపై దాడులు | task force police attacks on cinema theatres | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్లపై దాడులు

Feb 21 2018 9:57 AM | Updated on Aug 11 2018 8:29 PM

task force police attacks on cinema theatres - Sakshi

తనిఖీ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని సినిమా థియేటర్లలో తినుబండారాలను అధికధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం పలు థియేటర్లపై టాస్క్‌ఫోర్స్, తూనికల కొలతల అధికారులు దాడులు చేశారు. వేంకటేశ్వర, మమత, సాయికృష్ణ థియేరట్ల లో కూల్‌డ్రింక్‌ రూ.20 ఉండగా రూ. 25 నుంచి 30కి, తినుబండ రాలు రూ. 5 నుంచి రూ.10 అదనంగా విక్రయిస్తున్నారని గుర్తించారు.  క్యాంటీన్‌ నిర్వహకుల పై కేసు నమో దు చేశారు. మొదటి తప్పుగా ఒక్కోక్యాంటీన్‌కు రూ. 5 వేల జరిమానా విధించారు.

పునరావృతమైతే సీజ్‌  
థియేటర్లలో అధిక ధరలకు విక్రయాలు చేయడమే కాకుండా కొన్ని చోట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు అందాయని, మొదటిసారి జరిమానా విధించామని టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. ఇది పునరావృ తం అయితే క్యాంటీన్లు సీజ్‌ చేసి, చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐలు శ్రీనివాసరావు, మాధవి, కిరణ్, ఎస్సై రమేశ్, తూనికల కొలతల అధికారి విజయకుమార్‌ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement