మంచిర్యాలలో దొంగల హల్చల్
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో మంగళవారం వేకువజామున దొంగలు హల్చల్ చేశారు. కాశీపాక అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో జొరబడి 21 తులాల బంగారు నగలు, 90 వేల రూపాయల నగదు దోచుకున్నారు.
అదే వీధిలో మరో రెండిళ్ల తలుపులు, కిటికీలు పగులగొట్టి దొంగతనానికి ప్రయత్నించారు. స్థానికులు మేల్కొని కేకలువేయడంతో దొంగలు పరారయ్యారు. అప్పటికే అంజయ్య ఇంటిని దోచుకోవడంతో అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.