లైంగిక దాడి కేసులో నిందితుల రిమాండ్
నాగోలు: మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో నలుగురు నిందితులను మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సన్ప్రీత్సింగ్ వివరాలు వెల్లడించారు. ఒరిస్సా కు చెందిన రాహుల్ మాజీ, మనోజ్ సామ్రాట్, దుర్గ సామ్రాట్, దయామాజీ తదితరులు మహేశ్వరం మండలం, నాగులదోని తండాకు వచ్చి స్థానికంగా ఉండే జేఎంఆర్ ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన మహిళ కూడా అక్కడే పని చేసేది. ఈ నెల 16న సాయంత్రం సమయంలో ఇటుక బట్టీల సమీపంలో ఒంటరిగా ఉన్న మహిళను ఈ నలుగురు బెదిరించి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మహేశ్వరం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, మహేశ్వరం సీఐ వెంకన్న నాయక్ పాల్గొన్నారు.