టీఆర్‌ఎస్‌ నేతపై హత్యాయత్నం

Murder Attempt on TRS Leader Hyderabad - Sakshi

కేసు నమోదు

బంజారాహిల్స్‌: నారాయణఖేడ్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్, టీఆర్‌ఎస్‌ నేత బి.హనుమంతుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12, ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న హనుమంతు ఇంటికి మంగళవారం ఉదయం సిరిసిల్లకు చెందిన అనిల్‌రెడ్డి, గోపాల్‌నాయక్, గీతారెడ్డితో పాటు మరో నలుగురు అపరిచితులు వచ్చి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కుని రూ.2 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. అనంతరం అతడిని కారులో ఎక్కించుకొని సిరిసిల్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనకు అనిల్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించాలని కోరాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top