టీఆర్‌ఎస్‌ నేతపై హత్యాయత్నం | Murder Attempt on TRS Leader Hyderabad | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నేతపై హత్యాయత్నం

Mar 27 2019 7:12 AM | Updated on Mar 27 2019 7:12 AM

Murder Attempt on TRS Leader Hyderabad - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న హనుమంతు

బంజారాహిల్స్‌: నారాయణఖేడ్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్, టీఆర్‌ఎస్‌ నేత బి.హనుమంతుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12, ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న హనుమంతు ఇంటికి మంగళవారం ఉదయం సిరిసిల్లకు చెందిన అనిల్‌రెడ్డి, గోపాల్‌నాయక్, గీతారెడ్డితో పాటు మరో నలుగురు అపరిచితులు వచ్చి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కుని రూ.2 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. అనంతరం అతడిని కారులో ఎక్కించుకొని సిరిసిల్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనకు అనిల్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించాలని కోరాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement