తల్లి, కుమార్తె అదృశ్యం
కాచిగూడ:తల్లి, బిడ్డ అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. కాచిగూడ ఇన్స్పెక్టర్ అబీబుల్లాఖాన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నింబోలిఅడ్డ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ భార్య సుప్రియ యూసుఫ్గూడ, రహమత్నగర్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ స్వీపర్గా పనిచేస్తుంది. గురువారం నింబోలి అడ్డాలోని ప్రైవేట్ స్కూల్లో తన కుమార్తె విఘ్నశ్రీకి లంచ్బాక్స్ ఇచ్చేందుకు వెళ్లిన సుప్రియ అక్కడినుంచి కుమార్తెను తీసుకుని వెళ్లింది. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె భర్త సత్యనారాయణ బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వాకాబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో అతను శుక్రవారం సాయంత్రం కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధు తెలిపారు.