విద్యుదాఘాతంతో యువకుడి మృతి | Man died by electric shock In Nalgonda | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Jun 29 2018 1:38 PM | Updated on Sep 5 2018 2:26 PM

Man died by electric shock In Nalgonda - Sakshi

తేజ మృతదేహం 

గుర్రంపోడు : విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని లక్ష్మీదేవిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని తుర్కోనిబావి గ్రామానికి చెందిన గాదెపాక తేజ(20) లక్ష్మీదేవిగూడెం గ్రామంలో రైతు బుర్రి శేఖర్‌రెడ్డి బత్తాయితోటలో పురుగుల మందు పిచికారీ చేసేందుకు కూలికి వచ్చాడు.

తోటలోని విద్యుత్‌ స్తంభానికి గల స్టేవైరుకు కాలు తగలడంతో ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్‌ ప్రసరించడంతో షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న మరో కూలీ కర్రతో విడదీసే ప్రయత్నం చేసేలోపే తేజ అక్కడికక్కడే మృతిచెందాడు. తేజ నల్లగొండలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement