ప్రేమ జంట ఆత్మహత్య | Lockdown Love Couple End Lives in Asifabad Adilabad | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్య

May 9 2020 11:38 AM | Updated on May 9 2020 11:38 AM

Lockdown Love Couple End Lives in Asifabad Adilabad - Sakshi

ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ జంట

నార్నూర్‌(ఆసిఫాబాద్‌): ప్రేమ జంట మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఖంపూర్‌ గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖంపూర్‌ గ్రామానికి సోయం సీతాబాయి(20) ఉట్నూర్‌ మండలంలోని కన్నాపూర్‌ గ్రామానికి చెందిన పెందూ గణేశ్‌(22) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇరువురి నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి చేద్దామని మాట్లాడుకున్నట్లు తెలిపారు.

పెందూర్‌ గణేశ్‌ సీతాబాయి స్వగ్రామమైన ఖంపూర్‌లోనే కొన్ని రోజులుగా ఉంటున్నాడు. గురువారం పొలం పనుల కోసం అని వెళ్లి లాక్‌డౌన్‌ ముగుస్తుందో.. లేదో.. పెళ్లి జరగదేమోనని మనస్థాపానికి గురైన వారు అమ్మాయి సోదరుడికి ఫోన్‌ ద్వారా తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నటు తెలిపారు. ఆమె సోదరుడు అక్కడకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఎస్సై పంచనామా నిర్వహించి పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఉట్నూర్‌ తరలించి అమ్మాయి తండ్రి సోయం గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.(లాక్‌డౌన్‌: ట‌్ర‌క్కులో దొరికిన ప్రేమికులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement