పేషెంట్‌ను చితకబాదిన డాక్టర్‌: వైరల్‌

Doctor Attacks Patient In Jaipur - Sakshi

జైపూర్‌ : కడుపునొప్పని ఆసుపత్రిలో చేరిన ఓ రోగిపై విరుచుకుపడ్డాడో డాక్టరు. వైద్యం చేసి నొప్పినుంచి ఉపసమనం కలిగించాల్సిన వాడు, విచక్షణా రహితంగా రోగిపై దాడి చేశాడు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో అక్కడికి దగ్గరలోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ ఆసుపత్రిలో చేరాడు. నొప్పి తట్టుకోలేని స్థితిలో అతడు డాక్టర్లను ఇష్టమొచ్చినట్లు దూషించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ముబ్రిక్‌ అనే డాక్టర్‌ అతడిపై దాడికి దిగాడు. బెడ్‌పైకి ఎక్కిమరీ రోగిని చితకబాదాడు.

కొద్దిసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న మరో డాక్టరు ముబ్రిక్‌కు సర్థిచెప్పి అతన్ని పక్కకు పంపించేశాడు. అనంతరం గ్యాస్ట్రిక్‌​ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న సదరు రోగికి మందులిచ్చి ఇంటికి పంపేశారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ ఈ సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top