శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌సెర్చ్‌

cordan search to protect law and order - Sakshi

జగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ భద్రయ్య అన్నారు. జగిత్యాలలోని తెనుగువాడ, రెహ్మతాపూర్‌లో గురువారం ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలతో డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్‌ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎవరు అనుమానితులు వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని, కొత్తగా అద్దెకుంటామని వచ్చిన వారి వివరాలు సేకరించిన తర్వాతే ఇల్లు అద్దెకివ్వాలని సూచించారు.

కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు సరైన పత్రాలు చూసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా 33 బైక్‌లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సీఐలు ప్రకాశ్, నవీన్, కోటేశ్వర్, నాగేందర్‌బాబు, లక్ష్మణ్‌బాబు, ఎస్సైలు కిరణ్‌కుమార్, ట్రాఫిక్‌ ఎస్సై అంజయ్య, శ్రీనివాస్, ప్రసాద్, సతీశ్‌ పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top