మానవత్వం మరిచిన మేనత్త | Aunty Murdered Her Niece In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మానవత్వం మరిచిన మేనత్త

Feb 12 2019 6:20 PM | Updated on Feb 12 2019 9:48 PM

Aunty Murdered Her Niece In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మరిచిన మేనత్త సొంత మేనకోడలును హతమార్చింది. పెద బయలు మండలం లకేయిపుట్టులో మంగళవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాలు.. భార్యభర్తల మధ్య వచ్చిన తగాదాతో వంతాల రస్మో తన తమ్ముడి ఇంటికి వచ్చి ఉంటుంది. భర్తతో కాపురానికి వెళ్లమని తమ్ముడి భార్య మందలించడంతో కక్ష పెంచుకుంది. కట్టెలకోసం కొండప్రాంతానికి మేనకోడలు అనితను తీసుకెళ్లింది. సమీపంలో ఎవరూ లేరని గమనించి.. అమానుషంగా కత్తితో నరికి చంపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement