సాక్షి, గద్వాల: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 28 మంది గాయపడ్డారు. పత్తి జిన్నింగ్ మిల్లులో రాత్రి షిఫ్టులో పనిచేసి వస్తున్న కూలీల బొలెరో వాహనం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పారుచర్ల వద్ద చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణంలోని శ్రీ విజయలక్ష్మి మిల్లులో ధరూరు మండలం చిన్నపాడు, యములోనిపల్లి గ్రామాలకు చెందిన 35 మంది కూలీలు పనులకు వెళ్లారు. ఆదివారం నైట్ షిఫ్ట్లో పనిచేసి సోమవారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో తిరుగు పయనమయ్యారు. యాజమాన్యమే వాహనం సమకూర్చగా.. ఒకేసారి అందరినీ పంపించాలనే ఉద్దేశంతో 35 మందిని ఎక్కించారు.
ఇక 10 నిమిషాలు అయితే సొంతూరుకు చేరుకునే క్రమంలో గద్వాల మండలం గోనుపాడు శివారులోని పారుచర్ల స్టేజీ సమీపంలో తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో వాహనం బోల్తా పడింది. డ్రైవర్ సైతం కూలీలతో పాటే రాత్రి పనిచేసి ఉండటం.. ఆయన డ్రైవింగ్ చేసే క్రమంలో అలసటకు గురై నిద్రలోకి జారుకోవడంతో మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడిందని కూలీలు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చిన్నపాడు గ్రామానికి చెందిన కమ్మరి లోహిత్(35), కమ్మరి గీతమ్మ (35), కోట్ల వెంకటన్న (40), కొత్తబావి వెంకటన్న(35) యమ్మినోనిపల్లికి చెందిన అరుణ(18) అక్కడికక్కడే మృతి చెందారు. 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో 14 మందిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలం వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్పీ విజయ్కుమార్, డీఎస్పీ సురేందర్రావు ఘటనా స్థలం వద్ద పరిస్థితిని సమీక్షించారు. కాగా, మిల్లు యజమాని నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, పరిహారం చెల్లించే వరకు మృతదేహాలను కదిలించమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎస్పీ నచ్చజెప్పడంతో వారు శాంతించారు.
తెల్లారిన కూలీల బతుకులు
Published Tue, Jan 9 2018 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement