తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Jan 17 2018 8:34 AM | Updated on Jan 17 2018 8:34 AM

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడనక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 68,763 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,229 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ 3.21 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement