భక్తులతో తిరుమల కిటకిట

సాక్షి, తిరుమల: సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 67,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,920 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.81 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top