దక్షిణాదిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్లాంటు

Super Plastronics explores manufacturing in South - Sakshi

పరిశీలనలో తెలంగాణ, ఏపీ

కంపెనీ సీఈవో అవనీత్‌ సింగ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో కొడాక్, థామ్సన్‌ బ్రాండ్ల టీవీల తయారీ లైసెన్సున్న ‘సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌’... మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఉత్తరాదిన మూడు ప్లాంట్లున్న ఈ కంపెనీ నాల్గవ యూనిట్‌ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఇందుకోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిశీలనలో ఉన్నాయని సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం 2 లక్షల యూనిట్లు ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే ఎక్కువ ప్రోత్సాహకాలిస్తుందో అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 9 లక్షల యూనిట్లపైనే. కొడాక్, థామ్సన్‌ బ్రాండ్లలో 2017–18లో 2.1 లక్షల యూనిట్లు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.8 లక్షల యూనిట్లకు చేరుతుంది. కొడాక్‌ బ్రాండ్‌లో 14 మోడళ్లున్నాయి. ఈ ఏడాది కొత్తగా 8 మోడళ్లు మార్కెట్లోకి విడుదల చేస్తాం. టీవీల విపణిలో సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌కు 4 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 2022 నాటికి వాటాను రెండింతలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం టాప్‌–2 ప్లేయర్‌గా ఉన్నాం’ అని వివరించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top