రుణాలు@ 5.15 లక్షల కోట్లు | SBI rocks the boat of deposit rates, its peers may feel the pain | Sakshi
Sakshi News home page

రుణాలు@ 5.15 లక్షల కోట్లు 

Mar 13 2019 12:33 AM | Updated on Mar 13 2019 12:33 AM

SBI rocks the boat of deposit rates, its peers may feel the pain - Sakshi

హైదరాబాద్‌ బిజినెస్‌ బ్యూరో: గతేడాది డిసెంబర్‌ చివరినాటికి తెలంగాణలోని మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,33,036 కోట్లకు చేరినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. 4.86% వృద్ధితో రూ.20,091 కోట్ల మేర డిపాజిట్లు పెరిగినట్లు తెలియజేసింది. ఈ కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) 7.28 శాతం పెరిగి రూ.5,15,537 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఇక్కడి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కార్యాలయంలో జరిగిన 22వ ఎస్‌ఎల్‌బీసీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ జే.స్వామినాథన్‌ మాట్లాడుతూ.. ‘క్రెడిట్‌ డిపాజిట్‌ నిష్పత్తి (సీడీ రేషియో) 100% పైనే ఉంది. తాజాగా 119.05 శాతానికి చేరుకుంది. ఎంఎస్‌ఎంఈ విభాగం అనుకున్న విధంగా 134.31 శాతానికి చేరింది. ముద్రా రుణాలు సైతం నిర్థేశిత లక్ష్యం మేర పెరిగాయి’ అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనరు, ఎస్‌బీఐ జీఎం ఉన్‌ మయ్యాతో పాటు ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ సుబ్రతా దాస్, జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.శంకర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందీప్‌ సుల్తానియా, రాహుల్‌ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement