డిసెంబర్ 23న సత్యం కేసులో తుది తీర్పు | Satyam case: Nampallu cbi court set date for judgement on December 23rd | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 23న సత్యం కేసులో తుది తీర్పు

Oct 30 2014 12:47 PM | Updated on Sep 2 2017 3:37 PM

సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు డిసెంబర్ 23న వెలువడనుంది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఈ మేరకు కేసు తుది తీర్పు తేదీని ప్రకటించింది.

హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు డిసెంబర్ 23న వెలువడనుంది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం కేసు తుది తీర్పు తేదీని ప్రకటించింది. కాగా  కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement