బ్యాంకు సీఈవోలతో శక్తికాంత దాస్‌ భేటీ | RBI Guv Das Meeting with PSB Bank chiefs | Sakshi
Sakshi News home page

బ్యాంకు సీఈవోలతో శక్తికాంత దాస్‌ భేటీ

Jan 28 2019 7:41 PM | Updated on Jan 28 2019 7:44 PM

 RBI Guv Das Meeting with PSB Bank chiefs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో  రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సమావేశమయ్యారు. బ్యాంకింగ్‌ రంగం నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తోందో  తెలియజెప్పే ఉద్దేశంతో పలు బ్యాంకుల సీఈవోలతో  భేటీ అయినట్టు ఆయన వివరించారు. దీంతోపాటు ప్రస్తుత, భవిష్యత్తు అంశాలపై చర్చంచామని సమావేశం అనంతరం శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. 

2018-19 సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక మానిటరీ పాలసి రివ్యూ ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత ఆధ్వర్యంలో ఇది మొదటి పరపతి విధాన సమీక్ష.  మరోవైపు ఈ పరపతి సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఆర్థిక వ్యవస‍్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐసీఐసీఐ -వీడియోకాన్‌ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్‌పై కేసు నమోదు, దాదాపు సగానికిపైగా బ్యాంకులు ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) నిబంధనల కిందికి రావడం తదితర అంశాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement