మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలోకి ముత్తూట్‌ ఫైనాన్స్‌  | Muthoot Finance Introduces Mutual Funds | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలోకి ముత్తూట్‌ ఫైనాన్స్‌ 

Nov 23 2019 5:45 AM | Updated on Nov 23 2019 5:45 AM

Muthoot Finance Introduces Mutual Funds - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ముత్తూట్‌ ఫైనాన్స్‌ కొత్తగా మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రూ.215 కోట్లతో ఐడీబీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఐడీబీఐ ఏఎంసీ), ఐడీబీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ట్రస్టీ కంపెనీలో నూరు శాతం ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్టు ముత్తూట్‌ ఫైనాన్స్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది.

ఈ డీల్‌కు సెబీ తదితర నియంత్రణ సంస్థల ఆమోదం అవసరమని, వచ్చే ఫిబ్రవరి నాటికి కొనుగోలు పూర్తవుతుందని పేర్కొంది. ఐడీబీఐ ఏఎంసీ 2010లో ఏర్పాటు కాగా,  రూ.5,300 కోట్ల పెట్టుబడులు నిర్వహణలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement