యాడ్‌రోబ్ ద్వారా కృష్ణా పుష్కర జలం | krishna pushkara water sale in addrob | Sakshi
Sakshi News home page

యాడ్‌రోబ్ ద్వారా కృష్ణా పుష్కర జలం

Aug 8 2016 12:23 AM | Updated on Sep 4 2017 8:17 AM

యాడ్‌రోబ్ ద్వారా కృష్ణా పుష్కర జలం

యాడ్‌రోబ్ ద్వారా కృష్ణా పుష్కర జలం

కృష్ణా నదీ పుష్కరాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదీ జలాలను కృష్ణా జల్ బ్రాండ్ పేరుతో నగరానికి చెందిన ఈ కామర్స్ కంపెనీ యాడ్‌రోడ్‌డాట్‌ఇన్ డోర్ డెలివరీ చేయనున్నది.

కృష్ణా నదీ పుష్కరాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదీ జలాలను కృష్ణా జల్ బ్రాండ్ పేరుతో నగరానికి చెందిన ఈ కామర్స్ కంపెనీ యాడ్‌రోడ్‌డాట్‌ఇన్ డోర్ డెలివరీ చేయనున్నది. ఈ నెల 13 నుంచి 23 వరకూ హైదరాబాద్‌లో ఈ అవకాశాన్ని అందిస్తున్నామని యాడ్‌రోబ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నగరంలో అయితే 1 లీటర్ రూ.101 మాత్రమేనని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఇతర నగరాలకు రూ.151 అని,  భారత్‌లోని ఏ ఇతర నగరాలకైతే రూ.201 అని యాడ్‌రోబ్‌డాట్‌ఇన్ ఎండీ కేశిరెడ్డి రాజిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా పుష్కరాల సందర్భంగా కృష్ణా నదికి హారతి, దీపం సమర్పించే పుష్కర దీపం ప్యాకేజీని కూడా ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు యాడ్‌రోబ్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement