బ్యాంకింగ్ రెగ్యులేటర్ల సంతకాలు...
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), అమెరికా బ్యాంకింగ్ రెగ్యులేటర్ల ప్రతినిధులు ఫైనాన్షియల్ రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సంబంధించిన ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆర్థిక సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో సహకారం మరింత పెంపొందించుకోవడం లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. భారత్ ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ప్రకారం ఈ ఒప్పందం జరిగింది. ఆర్బీఐ, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్, కంప్ట్రోలర్ ఆఫ్ కరెన్సీ ఆఫీస్, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మధ్య ఆర్థిక సమాచార మార్పడి సంబంధాలు ఈ ఒప్పందంతో మరింత బలపడనున్నాయి. ఈ తరహాలో (ఫైనాన్షియల్ సమాచార మార్పిడి) ఇప్పటి వరకూ ఆర్బీఐ వివిధ దేశాల ఫైనాన్షియల్ రెగ్యులేటర్లతో 22 ఒప్పందాలను చేసుకుంది.
ఎన్బీఎఫ్సీ కేవైసీ నిబంధనలు సరళతరం
కాగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించిన ‘నో-యువర్-కస్టమర్’ (కేవైసీ) నిబంధనలను ఆర్బీఐ సరళతరం చేసింది. హై రిస్క్ ఇండివిడ్యువల్స్, కంపెనీలకు సంబంధించి ఆయా కంపెనీలు కనీసం ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవైసీ నిబంధలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాల్సి ఉంటుంది. తక్కువ స్థాయి రిస్క్కు సంబంధించి ఈ కాలపరిమితి 10 ఏళ్లుగా ఉంది. మీడియం రిస్క్ విషయంలో ఈ కాలం ఎనిమిదేళ్లు. ఇప్పటివరకూ లో రిస్క్ విషయంలో ఈ కాలపరిమితి ఐదేళ్లుకాగా, హై, మీడియం రిస్క్ విషయంలో రెండేళ్లుగా ఉంది. కాగా ఆయా అప్డేషన్ సందర్భాల్లో కస్టమర్లు స్వయంగా హాజరుకావాల్సిన అవసరం లేదని కూడా ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మైనర్ కస్టమర్లు మేజర్ అయినప్పుడు కొత్త ఫొటోలు తీసుకోవాలని పేర్కొంది. లో రిస్క్ కస్టమర్ల విషయంలో ఆయా వ్యక్తులు గత చిరునామాలోనే నివసిస్తున్నట్లయితే, అందుకు తాజా ఆధారాలు అవసరం లేదని తెలిపింది.
ప్రొడక్ట్పై కంపెనీ పేర్లకు ఆదేశం
ఇదిలాఉండగా, వైట్ లేబుల్ ఏటీఎంలు, స్మార్ట్ కార్డులు, ఈ-వాలెట్ వంటి సేవలను అందించే కంపెనీలు తాము అందించే ఆయా ప్రొడక్టులపై తమ కంపెనీల పేరును ప్రముఖంగా కనబడే లా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. పారదర్శకత లక్ష్యంగా ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపింది.
భారత్-అమెరికా సమాచార మార్పిడి ఒప్పందం
Published Sat, Jan 3 2015 1:03 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement