డీమ్యాట్ ఖాతాల్లో పెరుగుదల
2018లో 40 లక్షల నూతన ఖాతాలు
ముంబై: భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గతేడాదిలో గణనీయంగా పెరిగింది. బంగారం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు పోటీనిస్తూ ఈక్విటీ మార్కెట్లో కూడా పెట్టుబడులు వృద్ధి చెందుతున్నాయి. 2018లో నూతనంగా 40 లక్షల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభం కావడమే ఇందుకు నిదర్శనం కాగా, అంతక్రితం ఏడాదితో పోల్చితే 13 శాతం వృద్ధి నమోదైంది.
2017 చివరినాటికి 3.08 కోట్లుగా ఉన్నటువంటి డీమ్యాట్ ఖాతాలు.. గతేడాది చివరినాటికి 3.48 కోట్లకు పెరిగాయి. 2009లో ఈ ఖాతాల సంఖ్య 1.68 కోట్లుగా ఉన్నాయి. గడిచిన దశాబ్ధకాలంలో ఈక్విటీ పెట్టుబడులు ఎంతగా పెరిగాయనే విషయానికి ఈ గణాంకాలే నిదర్శనమని జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ అన్నారు.
మరిన్ని వార్తలు